మరిపెడలో తల్లి, ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన కూతురు

Mahabubabad Maripeda

మహబూబాబాద్: ప్రేమకు అడ్డు చెప్పాడని తల్లి, ప్రియుడితో కలిసి కూతురు తండ్రిని చంపింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిఎస్‌ఆర్ జెండాల్ తండాలో ధారావత్ కిషన్(40), కావ్య(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతురు పల్లవి తన ప్రియుడు సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా తండ్రి ఆమెను మందలించాడు.

ప్రేమను తండ్రి అంగీకరించలేదని తల్లి కావ్య, చెల్లి, ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి కిషన్‌పై దాడి చేశారు. తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కిషన్‌ను తల్లి సాంకి మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లమని వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఓ ఆస్పత్రికి కిషన్‌ను తల్లి తీసుకెళ్లింది. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సాంకి ఫిర్యాదు మేరకు ఇద్దరు కూతుళ్లు, భార్య, భూక్య సురేష్, బోడ చందు, దేవేందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి: నారా లోకేష్

Sports City provide

అమరావతి: ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాల కల్పన స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ కీడల్లో అథ్లెట్లకు మద్దతు లక్ష్యమని అన్నారు. రెండో రోజు డిల్లీలో లోకేశ్ పర్యటించారు. టోనీ బ్లేయర్ తో ముందు కేంద్ర కార్మికశాఖ మంత్రి మాండవీయతో సమావేశమయ్యారు. విద్యారంగంలో అభివృద్ధి కోసం ‘టోనీ బ్లేయర్ ఇన్ స్టిట్యూట్ సహకారం కోరారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ (Sports City Amaravati) నిర్మాణానికి సహకారం అందించాలని, ఎపిని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు చేయూత ఇవ్వాలని అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు  శరవేగంగా కొనసాగుతున్నాయని లోకేష్ తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి, రాష్ట్రంలోని పాఠశాలలు, క్రీడల అభివృద్ధికి చేయూత అందించాలని, 39 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు జరగుతున్నాయని, రూ. 341.57 కోట్లతో ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోదించాలని సూచించారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ సెంటర్ ఏర్పాటుకు వినతి చేశారు. అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్ ను తిరుపతిలో నెలకొల్పాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల వాసి

Jagtial Person

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు మధ్య జరుగుతున్న దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం వల్ల జగిత్యాలకు (Jagtial Person) చెందిన రవీందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. బతుకుదెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం రవీందర్ ఇజ్రాయెల్‌కు వెళ్లాడు. అయితే యుద్ధం జరుగుతుండగా.. బాంబు శబ్ధం వల్ల రవీందర్ గుండెపోటుతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రవీందర్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రవీందర్ మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

6వ రోజు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు.. 609 మంది మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సైనిక వివాదం బుధవారం మరింత తీవ్రమైంది. వరుసగా ఆరో రోజు ఇరుపక్షాలు ఒకదానిపై ఒకటి భీకర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. ఇరుదేశాల వైమానిక దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 609 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది పౌరులు గాయపడ్డారు. ఇరాన్‌లో 585 మంది మరణించగా.. ఇజ్రాయెల్‌లో 24 మంది వైమానిక దాడుల కారణంగా చనిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇజ్రాయెల్‌పై ఫట్టా-1 హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తో దాడుల్లో ఈ క్షిపణిని ఇరాన్ మొదటిసారి ఉపయోగించినట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. ఈరోజు తెల్లవారుజాము నుండి.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై క్షిపణులతో ఇరాన్ విరచుకుపడింది. దాదాపు 400 క్షిపణులను ప్రయోగించిందని.. వాటిని ఇజ్రాయెల్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అనుమానిత సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలో వైమానిక దాడులు కొనసాగిస్తోంది.

కాగా, ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చేరాలని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారని అమెరికా మీడియా నివేదించింది. దాంతోపాటు G7 శిఖరాగ్ర సమావేశం నుండి ట్రంప్ ఆకస్మికత్తుగా తిరిగి అమెరికా రావడంతో అమెరికా ఇజ్రాయెల్‌తో చేతులు కలుపుతుందనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారని.. అమెరికన్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపనున్నట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు.  ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాకున్నాడో తమకు తెలుసని.. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఖమేనీ.. యుద్ధం ప్రారంభమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయోల్ పై దాడులకు దిగింది.

 

టి-20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. ఇండియా మ్యాచ్‌ల లిస్ట్..

T-20 World Cup 2026

మహిళల టి-20 ప్రపంచకప్-2026 (T-20 World Cup 2026) షెడ్యూల్‌ను గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) విడుదల చేసింది. ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభంకానుంది. తొలిసారిగా ఈ టోర్నమెంట్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయి. జూన్ 12వ తేదీన తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరగనుంది. టోర్నమెంట్‌లో (T-20 World Cup 2026) గ్రూప్‌-1లో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్ ఉన్నాయి. గ్లోబల్ క్వాలిఫయర్‌లో అర్హత సాధించిన జట్లు ఈ గ్రూప్‌లో చోటు దక్కించుకుంటాయి.

లీగ్ దశలో జూన్ 14 నుంచి 28 వరకూ ఇండియా ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో తొలి మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇక టోర్నమెంట్ సెమీఫైనల్స్ జూన్ 30, జూలై 2 తేదీల్లో ఓవెల్ వేదికగా జరుగుతాయి. లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

టి-20 ప్రపంచకప్-2026 ఇండియా షెడ్యూల్:
జూన్ 14 : ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 17 : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్, హెడ్డింగ్లే
జూన్ 21 : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రాఫర్డ్
జూన్ 25 : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్, ఓల్డ్ ట్రాఫర్డ్
జూన్ 28 : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, లార్డ్స్.

తొలి టెస్ట్‌కి ముందు కోహ్లీపై బెన్‌ స్టోక్స్ ఆసక్తికర కామెంట్స్

Ben Stokes Virat Kohli

భారత్, ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకో రెండు రోజులే (శుక్రవారం నుంచి ప్రారంభం) ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ సారథ్యంలో భారత్ జట్టు ఈ సిరీస్‌లో ఎలా ఆడనుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ లేకుంటే మ్యాచ్‌లో మజా ఉండదు అని కామెంట్ చేశాడు.

టీమిండియా కోహ్లీ సేవలను కచ్చితంగా మిస్ అవుతుందన్న స్టోక్స్ .. అతని పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని అన్నాడు. 18వ నెంబర్‌ను కోహ్లీ తన గుర్తింపుగా మార్చుకున్నాడని.. వేరే ఆటగాడిపై ఆ నెంబర్‌ చూడటం విచిత్రంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. కోహ్లీ లేని టెస్ట్ క్రికెట్ అంత గొప్పగా ఉండదని.. కోహ్లీ ప్రత్యర్థిగా ఆడటంలో మజా ఉంటుందని తెలిపాడు. మైదానంలో ఉన్నప్పుడు తాను, కోహ్లీ దాన్ని యుద్ధరంగంగా భావిస్తామని.. ఆట విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాని.. కోహ్లీ ఒక క్లాస్ ప్లేయర్ అని ప్రశంసలు కురిపించాడు.

సోదరుడి అంత్యక్రియల్లో విమాన ప్రమాద బాధితుడు.. (ఎమోషనల్‌ వీడియో)

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ బుధవారం తన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో రమేష్ స్వల్ప గాయాలతో బయటపడగా..అతని సోదరుడు అజయ్ మృతి చెందాడు. చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రమేష్.. ఈరోజు సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అజయ్ మృతదేహాన్ని భుజాలపై మోస్తున్న ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రమేష్, తన సోదరుడి శవపేటికను భుజాన వేసుకుని, కుటుంబ సభ్యులు, సంతాపకులు డయ్యూలో అంతిమ సంస్కారాల కోసం వెళ్తున్న వీడియో కన్నీరు పెట్టిస్తోంది.

కాగా, ఎయిర్ విమానం బిజె మెడికల్ కాలేజీ హాస్టల్‌లోకి దూసుకెళ్లిన తర్వాత మండుతున్న శిథిలాల నుండి స్వల్ప గాయాలతో రమేష్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న వారందరూ ఈ ఘటనలో మరణించగా.. రమేష్ ఒక్కడే బతికాడు. అనంతరం ఆస్పత్రిలో చేరిన రమేష్ ను ప్రధాని మోడీ పరామర్శించి..మాట్లాడారు. తాజాగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.

తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం మాకు లేదు: నిమ్మల

tenders many projects

అమరావతి: మమ్మల్ని విమర్శించే తెలంగాణ నేతలు వారు చేసిన పనులు గుర్తుచేసుకోవాలని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతుల్లేకుండానే తెలంగాణ అనేక ప్రాజెక్టులకు టెండర్లు పిలిచిందని, కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులను అనుమతి లేకుండానే చేపట్టారని అన్నారు.  పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతి లేకుండానే చేపట్టలేదా? అని ప్రశ్నించారు. ప్రాథమిక దశ లోనే ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసమేనా? అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

భారత్‌కి మరింత బలం.. జట్టులోకి కీలక ఆటగాడు..?

Harshith Rana

భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. తక్కువ మంది అనుభవజ్ఞులు ఉన్న జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్.. ఇంగ్లండ్‌ని ఎలా ఎదురుకుంటుందో అని అంతా వేచి చూస్తున్నారు. ఈ సిరీస్‌కి ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతను శుభ్‌మాన్ గిల్‌కి అప్పగించారు. ఇక వైస్ కెప్టెన్ స్థానం రిషబ్ పంత్‌కి దక్కింది. మొదటిసారిగా సాయి సుదర్శన్ జట్టులో చోటు సంపాదించుకోగా.. శార్ధూల్ ఠాకూర్, కరుణ్ నాయర్‌లు సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్‌లు ఐదుగురు బౌలర్లు ఉణన్నరు. ఇప్పటికాదా ఈ ఐదుగురు బౌలర్లతో పటిష్టంగా ఉన్న భారత్‌కు మరింత బలం చేకూర్చుస్తూ.. మరో బౌలర్‌ని జట్టులోకి తీసుకున్నరు. అతనే హర్షిత్ రాణా (Harshith Rana). గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగన సిరీస్‌లో హర్షిత్ టెస్టుల్లోకి ఆరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో50.75 యావరేజ్‌తో నాలుగు వికెట్లు తీశాడు.భారత్‌ ఏ జట్టు, ఇంగ్లండ్‌ లయన్స్‌కు మధ్య జరిగిన మొదటి అనధికార టెస్టులో హర్షిత్‌ రాణా 99 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో 16 పరుగులు చేశాడు. అయితే హర్షిత్ గురించి బిసిసిఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

‘నువ్వొక నియంతవు’… అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా నిరసనలు

వాషింగ్టన్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్కు అమెరికాలో ఛేదు అనుభవం ఎదురైంది. మంగళవారం అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న అసిమ్ మునీర్.. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మునీర్ కు వ్యతిరేకంగా పాకిస్థానీయులు నిరసనలకు దిగారు. వాషింగ్టన్‌లో పాకిస్తాన్ జాతీయులు, పాకిస్తాన్ మూలాలు కలిగిన ప్రజలు.. మునీర్ ఉన్న హోటల్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అసిమ్ మునీర్, నువ్వు పిరికివాడివి అని నిరసనకారులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్మీ చీఫ్ మునీర్ వాషింగ్టన్‌లోని హోటల్‌కు చేరుకోగానే ఆయనకు వ్యతిరేకంగా నిరసనకారులు..”అసిమ్ మునీర్, నువ్వొక పిరికివాడివి, సామూహిక హంతకుడివి, నియంతవి” అని నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. నిరసనలతో మునీర్ ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించడంతో అధికారులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు వారితో వాదనలకు దిగారు.