‘సన్‌ ఆఫ్ సర్దార్-2’ ట్రైలర్ విడుదల.. నవ్వులే నవ్వుల్..

Son Of Sardaar 2

2010లో రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మర్యాద రామన్న’. ఈ సినిమాను హిందీలో ‘సన్‌ ఆఫ్ సర్దార్’ పేరుతో రీమేక్ చేశారు. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో హీరో. 2012లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ‘సన్‌ ఆఫ్ సర్దార్-2’ (Son Of Sardaar 2) త్వరలో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

తొలి భాగం పంజాబ్‌లో జరగగా.. రెండో భాగం స్కాట్‌లాండ్‌లో జరుగుతుందని ట్రైలర్ చూస్తే మనకి అర్థం అవుతోంది. మొదటి భాగంలో సొనాక్షి సిన్హా హీరోయిన్‌ కాగా, ఈ సినిమాలో (Son Of Sardaar 2) ట్రెండింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, అజయ్ దేవ్‌గన్ సరసన నటిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులతో నవ్వులు పూయిస్తోంది. స్కాట్‌లాండ్‌లో హీరోయిన్ కుటుంబానికి సహాయం చేసేందుకు వెళ్లిన హీరో ఎదురుకొనే సమస్యల గురించి ఈ స్టోరీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

జియో స్టూడియోస్, దేవ్‌గన్ ఫిలిమ్ బ్యానర్ల సమర్పణలో ఈ చిత్రాన్ని అజయ్ దేవ్‌గన్, జ్యోతి దేశ్‌పాండే, ఎన్ఆర్ పాచిసియా, ప్రవీణ్ తల్రేజా నిర్మిస్తున్నారు. విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఏ పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదు: రాజా సింగ్

Rajasingh

హైదరాబాద్: బిజెపికి కొద్ది రోజుల క్రితం గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Rajasingh) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన రాజీనామాను బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా ఆమోదించారు. అయితే తాను ఏ పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదని రాజా సింగ్ తాజాగా వెల్లడించారు. హిందుత్వ భావజాలంతో దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో 11 సంవత్సరాల క్రితం బిజెపిలో చేరానని ఆయన అన్నారు. పార్టీ తనను నమ్మి మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని.. పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కృషి చేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల బాధను తాను అధిష్ఠానానికి తెలియజేయకపోవచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పదవి, అధికారం, వ్యక్తిగత లాభం ఆశించి రాజీనామా చేయలదని స్పష్టం చేశారు. హిందుత్వం కోసమే పుట్టానని.. చివరి శ్వాస వరకూ దాని కోసమే పని చేస్తానని రాజా సింగ్ (Rajasingh) పేర్కొన్నారు.

జో రూట్ రికార్డు సెంచరీ.. శతక వీరుడిని బౌల్డ్ చేసిన బుమ్రా

Joe Root

లండన్: లార్డ్స్‌ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ (Joe Root) సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే రూట్ మూడంకెల స్కోర్‌ను దాటాడు. బుమ్రా వేసిన మొదటి బంతిని బౌండరీగా మలిచిన రూట్.. సెంచరీ సాధించడంతో పాటు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్‌ను రూట్ అధిగమించాడు. ఈ సెంచరీతో టెస్టుల్లో రూట్ 37 సెంచరీలు సాధించాడు. రూట్‌ కంటే ముందు ఈ జాబితాలో టాప్ నుంచి సచిన్ టెండూల్కర్ 51, జాక్వెస్ కల్లిస్ 45, రికి పాంటింగ్ 41, కుమార సంగక్కరా 38 ఉన్నారు.

ఇక రూట్ (Joe Root) సెంచరీతో పెరిగిన ఇంగ్లండ్ జోరుకు బుమ్రా బ్రేక్ వేశాడు. 86వ ఓవర్ రెండో బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌(44)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన జెమీ స్మిత్ సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీ సాధించి టెస్ట్ కెరీర్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాక.. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సాధించిన వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ రికార్డును (21 ఇన్నింగ్స్) సమయం చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన 88వ ఓవర్ తొలి బంతికి రూట్(104) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వోక్స్ (0) జురెల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 88 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. క్రీజ్‌లో జేమీ స్మిత్ (10), బ్రైడాన్ కార్స్ (0) ఉన్నారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. LKG నుండి PUC వరకు ఉచిత బస్సు ప్రయాణం

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ సహా ప్రభుత్వ పాఠశాలల్లో LKG (లోయర్ కిండర్ గార్టెన్) నుండి PUC (ప్రీ-యూనివర్శిటీ కోర్సు) వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసును ప్రకటించింది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి D.K. శివకుమార్ ఉచిత బస్సుపై ప్రకటన చేశారు. మారుమూల, వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు ప్రయాణ ఖర్చులను తగ్గించడం, పాఠశాల హాజరును పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సేవ విద్యార్థులు విద్యను పొందడాన్ని సులభతరం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు, సమయపాలన, మొత్తం విద్యా పనితీరును మెరుగుపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తుందని చెప్పారు.

ఈ మేరకు ఎక్స్ వేదిగా.. “ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది! ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో LKG నుండి PUC వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది” అని డిప్యూటీ సిఎం D.K. శివకుమార్ చెప్పారు.

నితీశ్ బౌలింగ్ చూసి సర్‌ప్రైజ్ అయ్యా: అనిల్ కుంబ్లే

Nitish Kumar Reddy

ఇంగ్లండ్‌తో లార్డ్స్ మైదానంలో వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్ పేసర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఓపెనర్లు ఇద్దరిని ఔట్ చేసి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా నితీశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే.. నితీశ్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. నితీశ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆయన అన్నారు.

‘‘లార్డ్స్‌లో తొలి రోజు నితీశ్ (Nitish Kumar Reddy) బౌలింగ్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. నిలకడగా.. సరైన ప్రాంతంలో బౌలింగ్ చేశాడు. తొలి వికెట్ గిఫ్ట్‌గా అనిపించినా.. రెండో వికెట్‌ను సూపర్ డెలివరితో రాబట్టాడు. జాక్ క్రాలీని చక్కటి బంతితో పెవిలియన్ చేర్చాడు. నితీశ్ ఫిట్‌నెస్‌ సూపర్. తొలి రోజు 14 ఓవర్లు వేశాడు. ఇంకా వేయగలడు. కుర్రాడు కావడంతో నియంత్రణతో బౌలింగ్ చేశాడు. ఆసీస్ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీయకపోయినా.. భాగస్వామ్యాలను విడదీసేలా బౌలింగ్ చేసే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉంటాడు. అందుకే అతనిపై వేటు వేయడం, పక్కన పెట్టడం వంటివి చేయద్దు ఇంకా అవకాశాలు ఇవ్వాలి’’ అని కుంబ్లే అన్నారు.

వ్యవసాయం, రైతుల పట్ల తప్పుడు రాతలు రాయిస్తారా? : జగన్

jagan fire chandrababu naidu

అమరావతి: ఎపి సిఎం చంద్ర బాబు నాయుడుకు కొమ్ము కాస్తూ ఎల్లో మీడియా మరింత దిగజారిపోయిందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. బంగారుపాళ్యానికి వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ తీరుపై రైతుల్లో ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసిందని, రైతులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించడం తమకే చెల్లిందని విమర్శించారు. వ్యవసాయం, రైతుల పట్ల తప్పుడు రాతలు రాయిస్తారా? అని నిలదీశారు. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా రాశారని, ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. పాలకుడని చెప్పుకోవడానికి, పత్రికలు అని చెప్పుకోవడానికి తమ ఎల్లో మీడియాకు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు.

పండిన పంటను కొనేవాడు లేక రైతులు పారబోస్తున్నారని, ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమేనని చెప్పారు. 2.2 లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట.. 76 వేల రైతు కుటుంబాల సమస్య ఇది అని రైతులు తమ కంటికి దొంగలు, రౌడీలు మాదిరిగా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. రైతులు కష్టాల్లో లేకుంటే మామిడికి రూ. 4 ఎందుకు ప్రకటించారని, మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని జగన్ ధ్వజమెత్తారు. తమ హయాంలో కిలో మామిడిని రూ. 25-29 కి కొనుగోలు చేశారని, మేలో తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను ఆలస్యంగా ఎందుకు తెరిచారని అన్నారు. తమ వాళ్లకు మేలు చేసే ఉద్దేశంతోనే ఇదంతా చేశారా? అని తమర్ని నిలదీస్తే తప్పుడు రాతలు రాయిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదని, తమ హయాంలో రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరకరణ నిధి పెట్టి..రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు.

రైతులు నష్టపోతున్నా తమరెందుకు ఆ పని చేయడం లేదు? అని ఏ పంటకు ఏ ధర ఉందనే సిఎమ్ యాప్ ఏమైందీ? అని ప్రశ్నించారు. గతేడాది తమరు ఇస్తానన్న రైతు భరోసా రూ. 20 వేలు ఇవ్వలేదని, ఈ ఏడాది కూడా దాని గురించిన ప్రస్తావన లేదని తమ హయాంలో మే చివరికల్లా పెట్టుబడి సాయం ఇచ్చేవాళ్లమని, ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సీడీని అటకెక్కించారని చురకలంటించారు. ఇ- క్రాప్ విధానాన్ని, ఆర్ బికెలను నిర్వీర్యం చేశారని, టెస్టింగ్ ల్యాబ్ లను సైతం నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారని, ప్రశ్నించిన తమపైన, రైతులపైన అవాకులు, చవాకులు పేలుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబూ అని జగన్ హెచ్చరించారు.

మగ, ఆడ బిడ్డలను సమానంగా చూడాలి: చంద్రబాబు

School place worship

అమరావతి: మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం పాఠశాల అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలు అని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పి పాఠశాలలో మెగా పిటిఎం 2.0 కార్యక్రమం నిర్వహించారు. పేరెంట్స్, టీచర్ల మెగా సమావేశంలో సిఎం పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచనలిచ్చారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..తాను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం కొత్త చెరువులో ప్రజలు ఇచ్చారని, పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నానని తెలియజేశారు. చదువుకుని పైకి వచ్చినవారు స్కూళ్లకు ఎంతోకొంత చేయూత ఇవ్వాలని సూచించారు. విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ కు అభినందనలు చెప్పారు.

ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్లను మరచిపోలేమని, తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుది అని అన్నారు. పనుల్లో పడి పిల్లల్ని మర్చిపోతున్నామని, లోకేష్ చదువుకునే రోజుల్లో ఎప్పుడూ పేరెంట్స్ మీటింగ్ కు వెళ్లలేకపోయానని గుర్తుచేశారు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం (Parents share) కావాలని, తాను మహిళా పక్షపాతినని ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని పేర్కొన్నారు. ఆడపిల్లలను చదివిస్తే ఏం వస్తుందని ఆనాడు అనుకునేవారని, మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదని అన్నారు. మగ, ఆడ బిడ్డలను సమానంగా చూసుకోవాలని, అందుకే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. మీ పిల్లల చదువు బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

గిల్ కు సహజంగానే ఆ నైపుణ్యాలు ఉన్నాయి: అశ్విన్

Shubman gill good handle media

హైదరాబాద్: రెండో టెస్టులో టీమిండియా గెలిచి సిరీస్‌ను సమం చేసింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ డబుల సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. కెప్టెన్ అయిన తరువాత మీడియాతో ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. గిల్ మీడియాతో వ్యవహరిస్తున్న తీరు ఎంతో ఆకట్టుకుటుంది. 25 ఏళ్ల కుర్రాడు ఎంతో పరిణతి చెందిన వ్యక్తిగా మాట్లాడుతుండడంతో గిల్‌ను భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు.

టీమిండియా విదేశాలకు వెళ్లినప్పుడు కెప్టెన్‌ను మీడియా టార్గెట్ చేస్తుందని అశ్విన్ తెలిపారు. పర్యటక జట్టును ఇబ్బందుల్లో పడేస్తే ఆటోమేటిక్‌గా ఆధిపత్యం సాధించవచ్చని లోకల్ మీడియా ఆలోచన చేస్తుందని చెప్పారు. గిల్ మాత్రం మీడియా విషయంలో సహజ సిద్ధంగానే వ్యవహరించాడని కొనియాడరు. ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా షో చేస్తున్నట్లు కనిపించలేదని మెచ్చుకున్నారు. పాతికేళ్లకే ఎలాంటి ప్రశ్నలకైనా ఇబ్బందిలేకుండా తెలికగా జవాబు చెబుతుండడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ప్లేయర్లకు మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో ముందే చెబుతున్నారని, గిల్ మాత్ర సహజంగానే నైపుణ్యాలను అందిపుచ్చుకున్నాడని ప్రశంసించారు.

నా తొలి ప్రేమ ఆయనతోనే: అనుష్క

Anushka shetty love story

టాలీవుడ్‌లో పలు సినిమాలలో నటించి అనుష్క శెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. సూపర్ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. బాహుబలి, విక్రమార్కుడు, లక్షం, సౌర్యం, చింతకాయల రవి, అరుంధతి వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు పొందారు. బాహుబలి సినిమాతో ఆమె పేరు నటిగా మార్మోగిపోయింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల పక్కన నటించి మెప్పించారు. ఆమెకు ఫిల్మ్ పేర్, నంది అవార్డులు వరించాయి. ఆమెకు ప్రస్తుతం 43 ఏళ్లు ఉన్న ఇంకా పెళ్లి చేసుకోలేదు. అభిమానులు పలుమార్లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని ప్రశ్నిస్తున్నారు.

ఓ ఇంటర్వ్యూలో తన తొలి ప్రేమ గురించి నోరు విప్పి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తారు. తాను ఆరో తరగతి చదువుతున్నప్పుడు క్లాస్‌మెట్ ఆమెకు ఐ లవ్ యు చెప్పాడు. ఆ పదానికి అర్థం తెలియకపోయినా ఓకే చెప్పేశానని వివరణ ఇచ్చింది. అది చిన్న విషయం అయినప్పటికి ఇప్పటికీ మధుర జ్ఞాపకంగా ఉందని అనుష్క గుర్తు చేసుకున్నారు. అనుష్కలో అమాయకత్వం ఇప్పటికీ అలాగే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అనుష్క నటిస్తున్న ‘ఘాటి’ సినిమాకు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి వంశీకృష్ణారెడ్డి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు : లోకేష్

Mega meeting parents teachers

అమరావతి: మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులేనని ఎపి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పి పాఠశాలలో మెగా పిటిఎం 2.0 కార్యక్రమం నిర్వహించారు. పేరెంట్స్, టీచర్ల మెగా సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతోందని చెప్పారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు (Student progress cards) చంద్రబాబు నాయుడు, లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ అని తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం పథకం  అమలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో నాణ్యత లేని యూనిఫామ్ లు ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని  పేర్కొన్నారు.

షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశామని, పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటాలని ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారని అన్నారు. పవన్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని, విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం అని సూచించారు. పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ కష్టపడి గెలుద్దాం అని మన తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వాలని చెప్పారు. తాను విద్యాశాఖను తీసుకుంటే చాలా మంది ఫోన్ చేశారని, కష్టమైన విద్యాశాఖ ఎందుకు అవసరమా? అన్నారని, కష్టపడడమంటే తనకు ఇష్టం అని చెప్పానని నారా లోకేష్ స్పష్టం చేశారు.