టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ఎవరంటే..

Ind VS Eng

లీడ్స్: భారత్, ఇంగ్లండ్ (Ind VS Eng) మధ్య క్రికెట్ సమరం ప్రారంభమైంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగుతున్న టీం ఇండియాకు (Ind VS Eng) ఈ సిరీస్ ఓ పరీక్ష కానుంది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తున్నట్లు కెప్టెన్ గిల్ తెలిపాడు. అంతేకాక.. సుదీర్ఘ సమయం తర్వాత కురుణ్ నాయర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

తుది జట్లు :
ఇండియా: యశస్వీ జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, కురుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ధ్ కృష్ణ.

ఇంగ్లండ్: జాక్ క్రావ్లే, బెన్ డక్కెట్, ఒల్లే పోప్, జో రూట్, హారీ బ్రూక్, బెన్‌ స్టోక్స్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *