రీల్స్‌ కోసం కన్న కూతురి ప్రాణాలతో చెలగాటం..

Rajasthan Parents

రీల్స్ చేసి సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వడానికి కొత్త కొత్త మార్గలు వెతుకుతున్నారు కొందరు. అందులో కొన్ని ప్రాణాంతకం అవుతున్నాయి. అలా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసి కూడా అలాంటి రిస్కీ రీల్స్ చేసే వాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ తల్లిదండ్రులు (Rajasthan Parents) రీల్ కోసం ఏకంగా తమ కూతురి ప్రాణాలతో చెలగాటం ఆడారు.

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో బరేథా జలాశాయం వద్ద ఓ జంట తమ ఏడేళ్ల కూతురిని జలాశయం గోడకు ఉన్న రాడ్స్‌పై అమర్చిన విద్యుత్ బాక్స్‌పై కూర్చోబెట్టారు. ఆ చిన్నారి అక్కడకు వెళ్లేందుకు భయపడుతున్నా.. వాళ్లు మాత్రం ఆమెని ప్రోత్సాహించారు. కొంచెం అదుపు తప్పిన ఆ చిన్నారి జలాశయంలో పడిపోయే ప్రమాదం ఉండేది. కానీ, ఆ జంట (Rajasthan Parents) మాత్రం దాన్ని పట్టించుకోలేదు. విద్యుత్ బాక్స్‌పై కూర్చోగానే కెమెరాని చూడమంటూ సైగ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

పిల్లలకు అలాంటి లైఫ్ రిస్క్ పనులు చేయవద్దని చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇలాంటి పనులు చేయాలని ప్రోత్సహించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని దానిపై తగిన చర్యలు తీసుకుంటామని బరేథా పోలీసులు తెలిపారు. సందర్శకుల భద్రత దృష్ట్యా జలాశయం వద్ద ఓ కానిస్టేబుల్‌‌ని ఏర్పాటు చేశామన్నారు.

ఎపి బ్రాండ్ ను దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు : పయ్యావుల

Payyavalu Keshav counter Jagan

అమరావతి: ఎపిలో ఏదో జరుగుతుందని మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తెలిపారు. జగన్ కు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎపి బ్రాండ్ ను దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నానని అన్నారు. ఎపిలో పరిశ్రమలు (Industries AP) పెట్టొద్దని పారిశ్రామిక వేత్తలకు ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో రెండు వందల మెయిల్స్ పెట్టించారని మండిపడ్డారు. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డిని తెరపైకి తెచ్చారని తెలియజేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఎపి బ్రాండ్ ఎక్కడా తగ్గలేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

మూడో టెస్ట్‌ బెన్‌ స్టోక్స్‌కు పెద్ద పరీక్ష: మైఖేల్ అథర్టన్

Ben Stokes

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో భారత్‌ను ఓడించాలని అనుకుంటోంది. జూలై 10వ తేదీ నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌కు (Ben Stokes) సవాల్ వంటిదని మాజీ ఆటగాడు మైఖేల్ ఆథర్టన్ అభిప్రాయపడ్డారు. ఈ టెస్ట్‌లో అతడు కఠినమైన సవాళ్లు ఎదురుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ అతని నాయకత్వ పటిమ, మానసిక, శారీరక సామర్థ్యానికి పెద్ద పరీక్ష అని ఆయన అన్నారు.

రెండో మ్యాచ్‌లో టాస్ సమయంలో పొరపాటు జరిగిందని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అంగీకరించారు. దీంతో స్టోక్స్ (Ben Stokes) కెప్టెన్సీ సామర్థ్యంపై అనుమానాలు వచ్చాయి. అయితే రాబోయే రెండు రోజులు స్టోక్స్‌కు చాలా ముఖ్యమని అథర్టన్ అన్నారు. ‘‘మొదటి టెస్ట్‌, రెండో టెస్ట్ మ్యాచ్‌కి మధ్య ఏడు రోజుల సమయం దొరికింది కానీ, రెండో టెస్ట్‌, మూడో టెస్ట్‌కి కేవలం మూడు రోజుల సమయమే ఉంది కాబట్టి.. ఆ సమయం స్టోక్స్‌కి ఎంతో ముఖ్యం. ఆ సమయంలోనే తిరిగి పుంజుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌పై విశ్వాసం ఉందని.. సీమ్ దాడిని బలోపేతం చేయాలని.. అందుకు జోష్ టంగ్, బ్రైడన్ కార్స్ స్థానంలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు.

కృష్ణా, గోదావరి బేసిన్ జలాలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమే: భట్టి

Bhatti Vikramarka fire Brs

హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లెక్కలు తీసుకొని అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఒకరికి సవాల్ విసిరితే మరొకరు బయటకు వచ్చారు అని అన్నారు. మహబూబాబాద్ లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రూ. లక్ష రుణమాఫీ విషయంలో మాజీ సిఎం కెసిఆర్ రెండుసార్లు మోసం చేశారని మండిపడ్డారు.

తొలిసారి రుణమాఫీ (Loan waiver first time) పూర్తి చేసేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ నేతలు పదేళ్లలో రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి బేసిన్ జలాలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. కాళేశ్వరం నిర్మించి పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని, అసత్యాలు మానకపోతే.. బిఆర్ఎస్ కు డిపాజిట్లు రావు అని అన్నారు. నోరుందికదా అని కెటిఆర్ ఏది పడితే అది మాట్లాడమేనా? అని భట్టి ప్రశ్నించారు.

భద్రాచలం ఇవొపై గ్రామస్థుల దాడి.. కారణం ఏంటంటే..

Bhadrachalam EO

భద్రాచలం: భద్రాచలం ఆలయ ఇవొ (Bhadrachalam EO) రమాదేవిపై ఓ గ్రామస్థులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందకు వెళ్లిన ఆమెపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాది ఆలయానికి చెందిన 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఎపి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా కొందరు ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన ఇవొపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇవొ రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మార్కెట్లోకి వచ్చేసిన హీరో విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్..

హీరో మోటోకార్ప్ తన విడా విడా బ్రాండ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విడా VX2’ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది కంపెనీ విడా సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్‌గా నిలిచింది. ఈ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేశారు. VX2 Go, VX2 Plus.

ధర పరంగా.. VX2 Go వేరియంట్ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో రూ. 59,490 (ఎక్స్‌ షోరూమ్)గా, సబ్‌స్క్రిప్షన్ లేకుండా రూ. 99,490గా కంపెనీ పేర్కొంది. మరోవైపు.. VX2 Plus వేరియంట్ ధర బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో రూ. 64,990 కాగా, సబ్‌స్క్రిప్షన్ లేకుండా రూ. 1.10 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ విషయానికి వస్తే.. VX2 Goలో ఉండే 2.2 kWh బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 92 కి.మీ వరకు రన్ అవుతుంది. అలాగే, VX2 Plusలో ఉండే 3.4 kWh సామర్థ్యం గల బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 142 కి.మీ వరకు ప్రయాణించగలదు.

ఇక, ఫీచర్లు పరంగా.. ఈ రెండు వేరియంట్లలో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, క్లౌడ్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ స్కూటర్లను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. VX2 మొత్తం 7 రంగుల్లో అందుబాటులో ఉంది. కానీ, VX2 Plus కేవలం రెండు రంగుల్లో లభిస్తుంది. హీరో ఈ స్కూటర్లపై 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ వారంటీని అందిస్తోంది. ఇది బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీగా నిలుస్తోంది.

 

ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలి: ఆనం

Anam Ramanarayana Reddy firi jagan

అమరావతి: ఎపి విఆర్ హైస్కూల్ లో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) తెలిపారు. విఆర్ హైస్కూల్ పేరు మార్చడంపై మంత్రి ఆనం అభ్యంతరం తెలిపారు. నెల్లూరు విఆర్ స్కూల్ ప్రారంభ కార్యక్రమంలో ఆనం వివాద వ్యాఖ్యలు చేశారు. విఆర్ విద్యాసంస్థలు తమ కుటుంబం పర్యవేక్షణలో ఉన్నాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం కక్షతో మేనేజింగ్ కమిటీ అధ్యక్ష పదవి (Chairmanship Committee) నుంచి నన్ను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థగా మారిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యాసంస్థల ద్వారా ఎదిగాకే మంత్రి నారాయణ రాజకీయాల్లోకి వచ్చారని తెలియజేశారు. తమ కుటుంబం మొదటి నుంచీ రాజకీయాల్లోనే ఉంది ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

కన్నప్పలో ఆ పాత్రలు ఇరిటేషన్ తెప్పించాయి: తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja

హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) ఈ సినిమా గురించి మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పిన ఆయన.. అన్ని కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదని అన్నారు. సినిమా రూ.200 కోట్లతో నిర్మిస్తే.. పది రోజుల్లో కేవలం రూ.50 కోట్లు కూడా వసూలు చేయలేకపోయిందని.. దీంతో నిర్మాత మోహన్‌బాబుకు తీవ్ర నష్టం వచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) మాట్లాడుతూ.. సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచన చేశారు కానీ.. భక్తి తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భక్తే ప్రధానంగా సినిమా తీసి ఉంటే రూ.1000 కోట్ల కలెక్షన్లు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. సినిమాలో అందరూ చాలా బాగా నటించాని కితాబిచ్చిన ఆయన.. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్‌ను చూస్తుంటే తనకు ఇరిటేషన్ వచ్చిందని తెలిపారు. కన్నప్ప సినిమా చూస్తున్నంత సేపు ‘అన్నమయ్య’ సినిమా కాన్సెప్టు గుర్తుకు వచ్చిందని పేర్కొన్నారు. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ తీసుకున్నారని అన్నారు. ఏదేమైనప్పటికీ.. కన్నప్ప విషయంలో బాగా కష్టపడిన విష్ణును అభినందించాలని తెలిపారు. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను కొందరు ట్రోల్ చేసినా.. బ్యాడ్ రిపోర్టు రాలేదని.. ఒక్కసారి అయినా చూడాల్సిన సినిమాగా రివ్యూలు వచ్చాయన్నారు.

కెసిఆర్ కుటుంబంపై కాంగ్రెస్ కు ఎందుకంత ప్రేమ? బండి

Bandisanjay comments BRS

హైదరాబాద్: తెలంగాణ కోసం మాజీ సిఎం కెసిఆర్ కు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మద్దతు తెలిపిందని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ (Bandisanjay) తెలిపారు. తన కొడుకు ఖరీదైన బట్టలు వేసుకుంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఓర్వలేకపోయారని అన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి స్థాయి కంటే కెటిఆర్ ది తక్కువ స్థాయని చెప్పారు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఉద్యమాన్ని ఆంధ్రజ్యోతి నడిపిందని తెలియజేశారు. ఎబిఎన్ పై దాడిచేసి చూడు.. నీ బిఆర్ఎస్ ను ఏం చేస్తామో తెలుస్తుంది అని మండిపడ్డారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని స్థాయిలో ఉందని, కెసిఆర్ కుటుంబంపై కాంగ్రెస్ కు ఎందుకంత ప్రేమ? అని కెసిఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? అని ప్రశ్నించారు. వాడు వీడు అని ఇష్టానుసారంగా మాట్లాడితే.. కెసిఆర్ కుటుంబం కార్లు కూడా తిరగనివ్వం అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) రాకముందు..తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని నిలదీశారు. కెసిఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ధ్వజమెత్తారు. కెటిఆర్ కు అహంకారం తగ్గలేదు అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

ఇంత విషాదంలో కూడా.. అదిరిపోయే ప్రదర్శన చేసిన ఆకాశ్‌దీప్

Akashdeep

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పేసర్ ఆకాశ్‌దీప్ సింగ్ (Akashdeep) అదరగొట్టాడు. తన రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతను పది వికెట్లు తీశాడు. అయితే తన ఇంట విషాదం ఉన్నా కూడా అతను దేశం కోసం ఆడాడు. ఆకాశ్‌దీప్ బిసిఎ నుంచి బ్యాన్‌ని ఎదురుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే తన తండ్రి పక్షవాతంతో ప్రాణాలు వదిలేశారు. అది జరిగిన రెండు నెలలకే అతని సోదరుడు కూడా మృతి చెందాడు. ప్రస్తుతం అతడి సోదరి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శనని ఆకాశ్ తన సోదరి జ్యోతి సింగ్‌కు అంకితం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోతి సింగ్.. తన ఆరోగ్య పరిస్థితి, ట్రీట్‌మెంట్‌తో పాటు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు ఆకాశ్‌తో మాట్లాడిన విషయాలను ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తన సోదరుడు దేశం గర్వపడేలా ప్రదర్శన చేశాడని.. పది వికెట్లు తీయడం అద్భుతమని ఆమె కొనియాడారు. ‘‘ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు ఎయిర్‌పోర్టులో మేం కలుసుకున్నాం. అప్పుడు నా ఆరోగ్యం బాగుందని.. నా గురించి ఆందోళన వద్దని చెప్పాను. ప్రస్తుతం నేను మూడో స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. దీనికి కనీసం ఆరు నెలల ట్రీట్‌మెంట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఆకాశ్ వికెట్ తీసినప్పుడల్లా మేం ఎంతో సంతోషించాం. నా గురించి మీడియాతో చెబుతాడని అనుకోలేదు. ఎంతో భావోద్వేగానికి గురై అలా అంకితం చేశాడు. అతనికి మాపై ఉన్న ప్రేమ అలాంటిది. మ్యాచ్ ముగిసిన తర్వాత వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. ‘కంగారు పడొద్దు దేశం మొత్తం మనకు అండగా ఉంది’ అని చెప్పాడు. ఆ మాటలు విని ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మా నాన్న, అన్నయ్య లేనప్పటికి ఆకాశ్ (Akashdeep) కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఇలాంటి సోదరుడు ఉండటం చాలా అదృష్టం’’ అని జ్యోతి సింగ్ పేర్కొన్నారు.