అమరావతి: సిఎం గా పనిచేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు చట్టాలపై గౌరవం లేదు అని ఎపి ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు సిఎం చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగయ్య చనిపోయిన ఘటనలో జరిగిన తప్పుకు జగన్ క్షమాపణ కోరాలి అని సూచించారు. సింగయ్య కుటుంబానికి (Singaya family) అండగా ఉంటాం అని జగన్ చేసే తప్పును వైసిపి కార్యకర్తలు ఖండించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నాయకత్వంలో పని చేస్తున్నారో వారు గుర్తించాలని కలిశెట్టి పేర్కొన్నారు.
జగన్ తప్పును వైసిపి కార్యకర్తలు ఖండించాలి: కలిశెట్టి

Leave a Reply