జగన్ పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారు: గొట్టిపాటి

Gottipati Ravikumar comments jagan

అమరావతి: ప్రజల్లో ఆదరణ ఉందని చూపడం కోసం ఎపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అమాయకులను బలిగొంటున్నారని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తన పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ లో డబ్బు(Money betting) పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి…మరో రెండు నిండు ప్రాణాలు బలితీసుకున్నారని విమర్శించారు. వాహనం ఢీకొన్న వెంటనే ఆసుపత్రికి తరలిస్తే సింగయ్య ప్రాణం నిలబడేదని ఆవేదనను వ్యక్తం చేశారు. చేసిన పనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదని గొట్టిపాటి రవికుమార్ దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *