పంత్ వీరోచిత బ్యాటింగ్.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు

Rishabh Pant

లీడ్స్: ఇంగ్లండ్‌లో హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సెంచరీలతో చెలరేగిపోగా.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) అర్థశతకం సాధించాడు. జైస్వాల్ వికెట్ తర్వాత క్రీజ్‌‌లోకి వచ్చిన పంత్ తన దూకుడైన బ్యాటింగ్‌తో దంచికొడుతున్నాడు. ఈ క్రమంలో టీం ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును పంత్ బద్దలుకొట్టాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా పంత్ (Rishabh Pant) రికార్డు సాధించాడు. డబ్ల్యూటిసిలో 35 మ్యాచులు ఆడిన పంత్ 58 సిక్సులు కొట్టాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ(56) పేరిట ఉండేది. కాగా, రెండోరోజు 359 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ బ్యాట్స్‌మెన్లు గిల్, పంత్‌లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 94 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి భారత్ 393 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (139), పంత్ (84) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *