విమాన ప్రమాదంలో.. పలువురు వైద్య విద్యార్థులు మృతి?

Medical Students Flight Crash

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 242 ప్రయాణీకులతో ఉన్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికే కుప్పకూలిపోయింది (Flight Crash). అయితే విమానం బిజె ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థుల (Medical Students) హాస్టల్ భవనాలపై కూలింది. ఈ ప్రమాదంలో పలువు వైద్య విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. భోజన సమయం కావడంతో అధికశాతం మంది విద్యార్థులు హాస్టల్‌లోనే ఉన్నారు. అదే సమయంలో విమానం కూలిపోయింది. దీంతో పలువు విద్యార్థులు మృత్యువాత పడినట్లు సమాచారం. విమానం హాస్టల్ భవనంపై కూలిపోవడంతో భవనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వైద్య విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

డబ్ల్యూటిసి ఫైనల్ అరుదైన ఘటన.. 145 ఏళ్లలో తొలిసారి

WTC Final

లండన్: లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న ఐసిసి డబ్ల్యూటిసి ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతిఫ్రికా హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లోఆస్ట్రేలియాని సఫారీ బౌలర్లు 212 పరుగులకే ఆలౌట్ చేయగా.. తొలి రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నెంబర్ 1 స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఆటగాళ్లు డకౌట్ అయ్యారు.

డబ్ల్యూటిసి ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా 20 బంతులు ఆడి పరుగులు చేయకుండా పెవిలియన్ చేరగా.. సఫారీ బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రమ్ 6 బంతులు ఎదురుకొని డకౌట్ అయ్యాడు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి. 1880లో మొట్టమొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్‌ ఇంగ్లండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌తో కలుపుకొని ఇంగ్లండ్‌లో 561 టెస్ట్‌ మ్యాచ్‌లు జరగగా.. ఇప్పటివరకూ ఇలాంటి సంఘటన జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఇరు జట్ల నెంబర్ 1 ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ డకౌట్ అవ్వడం ఇది 10వ సారి. తొలిసారిగా 1977లో ఆస్ట్రేలియా ఇండియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్, ఆసీస్ బ్యాట్స్‌మెన్ జాన్ డైసన్ డకౌట్ అయ్యారు.

గుజరాత్ లో కూలిన విమానం…. 242 మంది మృతి?

Plane crash in Gujarat

గాంధీనగర్: గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ఇండియా విమానం కూలిపోయింది.  సివిల్‌ ఆస్పత్రి సమీపంలో విమానం చెట్టును ఢీకొట్టిన అనంతరం జనావాసాలపై కూలింది. టేకాఫ్‌ అయిన వెంటనే విమానం కూలిపోయింది. అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. బిఎస్ఎఫ్ సిబ్బంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు.   పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 అనే విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న 242 మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు గుజరాత్‌ కు బయల్దేరారు. ప్రమాదంపై గుజరాత్‌ సిఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌ చేసి ఆరా తీశారు. విమానంలో మాజీ సిఎం విజయ్‌ రూపానీ ఉన్నట్లు సమాచారం.