
Love Tragedy: తాడేపల్లిలో పోలకంపాడులో దారుణం చోటు చేసుకుంది. నమ్మింది సర్వస్వం ఇవ్వడంతో.. నమ్మినవాడు నయ వంచన చేస్తాడని ఊహించలేక పోయింది. చివరికి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి అయింది. ఉరి వేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు.. కలిసి షికార్లు కొట్టారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అక్కడి నుంచి ప్రియురాలికి, ప్రియుడి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు, అసభ్యం ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి.. పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. దీంతో మనస్తాపనికి గురైన ప్రియురాలు.. నమ్మినవాడు ఇలా చేస్తాడని ఊహించలేకపోయింది.. తల్లిదండ్రులు ఓదార్చినా.. పేరెంట్స్ పనులకు వెళ్లిన సమయంలో., ఇంట్లో ఎవరు లేనిది చూసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసు స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వేధింపులకు గురి చేసి, తమ కూతురు మృతికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.





