నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టీమ్ ఇండియా తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నెగ్గిన ప్లేయర్గా నిలిచారు. నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచులో POTM రావడంతో ఆయన ఖాతాలో అవార్డుల సంఖ్య 17కు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ(16), రోహిత్ శర్మ(14), అక్షర్ పటేల్(8) ఉన్నారు. T20I WCలో భారత్ తరఫున అత్యధిక POTMలు గెలిచిన జాబితాలో కోహ్లీ(8), సూర్య(4), యువరాజ్(3), అశ్విన్(3), రోహిత్(3) ఉన్నారు.
The post విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్ appeared first on Navatelangana.





