నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ గోపన్పల్లిలో ఏటీఎం క్యాష్ చోరీ కలకలం రేపింది. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ అజిత్ రూ. 60 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఏకంగా ఏటీఎం క్యాష్ తరలించే వ్యాన్ను కొంతదూరం తీసుకెళ్లి అందులో ఉన్న రూ. 60 లక్షలు తీసుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అజిత్ ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.
The post హైదరాబాద్లో ఏటీఎం క్యాష్ చోరీ..క్యాష్ వ్యాన్ తో డ్రైవర్ పరార్ appeared first on Navatelangana.





