నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే యీలి వరలక్ష్మి (80) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యంతో శుక్రవారం రాత్రి తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె అంత్యక్రియలు తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి ఒడ్డున నిర్వహించారు. ఆమె భర్త యీలి ఆంజనేయులు మున్సిపాలిటీ ఛైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. భర్త ఆకస్మిక మృతితో 1983లో ఆమె రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేగా గెలిచారు.
The post మాజీ ఎమ్మెల్యే కన్నుమూత appeared first on Navatelangana.






