నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల లడ్డూ వివాదం మళ్లీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్పై మరో కమిటీని ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సిట్, సీబీఐ, టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్పై నేడు (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
The post మళ్లీ సుప్రీంకోర్టు ముందుకు తిరుమల లడ్డూ వివాదం appeared first on Navatelangana.








