నవతెలంగాణ – హైదరాబాద్; టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న కొలంబోలో జరిగిన మ్యాచ్లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసి సూపర్-8కు చేరింది. పాక్ వికెట్లు వరుసగా పడుతుండటంతో, ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మ్యాచ్ ముగియకముందే స్టేడియం వదిలి వెళ్లడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమ జట్టు పరాజయాన్ని చూడలేకే ఆయన మధ్యలోనే వెళ్లిపోయారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
The post భారత్ విజయం.. మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగిన పీసీబీ చైర్మన్ appeared first on Navatelangana.





