నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం త్వరలో మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. అయితే దీనికి పౌరసరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకొని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులున్న 5లక్షల మందికి కార్డులివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక కార్డులు లేని వారు ఆధార్ కార్డుతో ఫ్రీ జర్నీ చేయవచ్చు. బస్పాస్/మీ-సేవా సెంటర్లలో రూ.50 చెల్లించి ఈ కార్డులను పొందవచ్చు. జూన్ 2 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.
The post తెల్ల రేషన్ కార్డులున్న వారికి మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’! appeared first on Navatelangana.





