నవతెలంగాణ-హైదరాబాద్ : టి20 ప్రపంచ కప్ సూపర్ 8 దశలో భాగంగా గురువారం రెండు కీలక మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడతాయి. రాత్రి 7 గంటలకు చెన్నైలో భారత్, జింబాబ్వే ఢీకొంటాయి. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైన భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే, ఈ మ్యాచ్లో మంచి నెట్ రన్ రేట్తో గెలవడం తప్పనిసరి. లేదంటే సెమీఫైనల్ అవకాశాలు దాదాపుగా కనుమరుగవుతాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే ఒక్కో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందున్నాయి.
The post టి20 ప్రపంచ కప్..నేడు 2 కీలక మ్యాచ్లు appeared first on Navatelangana.





