ఆ హీరోయిన్‌పై కోపం.. సందీప్ వంగా ఈ విధంగా చూపించారా..?

Sandeep Reddy Vanga

తీసిన సినిమాలు తక్కువే అయినా.. యూత్‌లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆయన.. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే చిన్న కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌ని తీసుకోవాలని భావించగా.. కొన్ని కండీషన్స్ వల్ల ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించారు.

అయితే ఈ విషయంపై సందీప్ (Sandeep Reddy Vanga) తీవ్రంగా స్పందించారు. తను ఆ హీరోయిన్‌ను నమ్మి స్టోరీ మొత్తం చెప్పానని.. దర్శకులు నటీనటులకు కథ నెరేట్‌ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్‌క్లోజర్‌ అగ్రిమెంట్‌ ఉన్నట్లే.. కానీ, ఆ హీరోయిన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి స్టోరీ లీక్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. నటి దీపికా పదుకొణె గురించే ఈ పోస్ట్ పెట్టారని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు సందీప్ పెట్టిన మరో పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.

తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో సందీప్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన ఆరు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా సందీప్ హీరో షాహిద్ కపూర్ లేకుండా.. కేవలం హీరోయిన్ కియారా అడ్వాణీ ఫోటోని పోస్ట్ చేసి.. విషెస్ చెప్పారు. దీంతో ఇది మళ్లీ చర్చకు దారి తీసింది. స్టార్ హీరోయిన్‌తో వివాదం వేళ కియారాను ప్రశంసించేందుకే సందీప్ ఈ విధంగా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్న పథకాలన్నీ అమలు చేస్తున్నాం: షబ్బీర్ అలీ

Shabbir Ali

నిజామాబాద్: ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని ప్ఱభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ (Shabbir Ali)  మాట్లాడుతూ.. ఆదివారం కళ్యాణ లక్ష్మి 130 మంది లబ్ధిదారులకు ఒక కోటి 60 లక్షల 18,560 రూపాయలను పంపిణీ చేస్తున్నామని, అలాగే షాదీ ముబారక్ 442 లబ్ధిదారులకు నాలుగు కోట్ల 12 లక్షల 47వేల 792 రూపాయలు అందించామని.. మొత్తం లబ్ధిదారులకు ఐదు కోట్ల 72 లక్షల 66,352 రూపాయలు అందించామని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.500కు సిలిండర్, 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇందిరమ్మ ఇల్లు రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు తహర్ బిన్ హందన్, కీరవత్రి అనిల్, మోహన్ రెడ్డి , నూడా చైర్మన్ కేశ వేణు, గ్రంధాలయ చైర్మన్ రాజి రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓ చిన్న తప్పు.. శుభ్‌మాన్ గిల్‌కు జరిమానా..?

Shubman Gill

లీడ్స్: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్ (Shubman Gill).. తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా అతడు రికార్డు సాధించాడు. అయితే శుభ్‌మాన్ చేసిన ఓ చిన్న తప్పుకు అతడికి జరిమానా పడే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో శుభ్‌మాన్ (Shubman Gill) నలుపు రంగు సాక్సులు ధరించాడు. ఐసిసి ప్లేయర్ క్లాతింగ్-ఎక్విప్‌మెంట్ నిబంధన (క్లాస్ 19.45) ప్రకారం.. టెస్ట్ మ్యాచ్‌లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా బూడిద రంగులో ఉండాలి. ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ ఉల్లంఘించినందుకు గిల్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే అది మ్యాచ్ రెఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఐసిసి నిబంధనల ప్రకారం లెవల్ 1 తప్పిదానికి ఫైన్ తప్పదు. కానీ, గిల్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ తప్పు చేయలేదని రెఫరీ భావిస్తే.. అతడు జరిమానా నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది.

కాగా, ఈ మ్యాచ్‌‌లో 227 బంతులు ఎదురుకున్న గిల్ 147 పరుగులు చేసి బషీర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 107 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 453 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్ (134), జడేజా (2) ఉన్నారు.

యోగాంధ్ర పై.. జగన్ విమర్శలకు చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్నిగురించి వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాధనం వృథా అంటూ విమర్శలు చేశారు. యోగాంధ్ర గూర్చి జగన్ వ్యతిరేకతపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace) కు రూ. వందల కోట్లు ఖర్చు చేసిన వాళ్లు ఎద్దేవా చేస్తున్నారని, ఇలాంటి శుభ సందర్భంలో కొందరి గురించి మాట్లాడటం అనవసరం అని అన్నారు. కాలుష్యాన్ని కలుషితం చేద్దామనుకునే చర్యలను ఉపేక్షించనని హెచ్చరించారు. భూతాన్ని నియంత్రించడంపై ప్రజలను చైతన్యపరుస్తాం అని యోగాంధ్రకు కేంద్రం రూ.75 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

పంత్ వీరోచిత బ్యాటింగ్.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు

Rishabh Pant

లీడ్స్: ఇంగ్లండ్‌లో హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సెంచరీలతో చెలరేగిపోగా.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) అర్థశతకం సాధించాడు. జైస్వాల్ వికెట్ తర్వాత క్రీజ్‌‌లోకి వచ్చిన పంత్ తన దూకుడైన బ్యాటింగ్‌తో దంచికొడుతున్నాడు. ఈ క్రమంలో టీం ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును పంత్ బద్దలుకొట్టాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా పంత్ (Rishabh Pant) రికార్డు సాధించాడు. డబ్ల్యూటిసిలో 35 మ్యాచులు ఆడిన పంత్ 58 సిక్సులు కొట్టాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ(56) పేరిట ఉండేది. కాగా, రెండోరోజు 359 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ బ్యాట్స్‌మెన్లు గిల్, పంత్‌లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 94 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి భారత్ 393 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (139), పంత్ (84) ఉన్నారు.

Mega 157: చిరంజీవి కనిపించేది ఈ పాత్రలోనే..?

Mega 157

తనదైన స్టైల్ కామెడీతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఆకట్టుకొనే సినిమాలు తీయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి ముందుంటారు. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలు అన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మెగా 157’ (Mega 157) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో చిరంజీవి మాస్టర్, ఠాగూర్ చిత్రాల్లో లెక్చరర్ పాత్రలో నటించారు. కాగా, ఈ సినిమాలో (Mega 157) ఆయన స్కూల్ డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. గురువారం ముస్సోరీలో ఈ సినిమా రెండో షెడ్యూల్‌లో స్కూల్ నేపథ్యంలోని సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తారని రూమర్స్ వస్తున్నాయి. హీరోయిన్ క్యాథరీన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

రాష్ట్రంలో చిల్లర పంచాయితీలు పెడుతున్నది కెసిఆర్, హరీష్ రావు: ఆది శ్రీనివాస్

Banakacharla divert farmers

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు నీటి విషయంలో సమస్య పరిష్కారం అవుతుందనే భయంతో ఉన్నారని,  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎన్ వొసి ఇచ్చాక నీరు వాడుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి చెబితే, హరీష్ రావు తప్పుపడుతున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం అయితే మాట్లాడడానికి మరో అంశం ఉండదనే అభద్రత భావంతో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో చిల్లర పంచాయితీలు పెడుతున్నది మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అని మండిపడ్డారు. గతంలో తెలంగాణకు ద్రోహం (Betrayal Telangana) చేసింది కెసిఆర్, హరీష్ రావు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కెసిఆర్, హరీష్ రావు చర్యల వల్ల తెలంగాణ నష్టపోతుందని, బిఆర్ఎస్ పాలన నుంచే తెలంగాణకు నష్టం జరుగుతోందని చెప్పారు. రైతులను డైవర్ట్ చేయడానికి బనకచర్ల అంశాన్ని ముందుకు తెచ్చారని  ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.

ట్రెండ్ ఫాలో కానీ సందీప్ వంగా.. ఏ కారు కొన్నారంటే..

Sandeep Reddy Vanga

సాధారణంగా సినిమా వాళ్లంటే.. వాళ్ల లగ్జరీ లైఫ్ గుర్తొస్తుంది. వాళ్ల నివాసాలు, ధరించే వస్త్రాలు, వాడే కార్లు, బైక్‌లు అందరని ఆకట్టుకుంటాయి. అలాంటి లైఫ్‌స్టైల్ కనీసం ఒక్కసారైనా బతకాలని అందరికీ ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఎంత సక్సెస్ వచ్చిన చాలా సింపుల్‌గా ఉంటారు. అందులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకరు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో గ్రాండ్ సక్సెస్ అందులోకి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు సందీప్.

ప్రస్తుతం సందీప్ (Sandeep Reddy Vanga) రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తొలుత ఈ సినిమాలో దీపికా పదుకొనేను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది.

తాజాగా సందీప్ రెడ్డి కొత్త కారు కొన్నారు. అందరిలా కోట్లల్లో కాకుండా.. చాలా తక్కువ బడ్జెట్‌లో ఆయన మినీ కూపర్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ పూర్తి కాగా.. గురువారం పూజ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర మార్కెట్‌లో రూ.60-70 లక్షలు ఉంటుందని అంచనా.

గంజాయి, మద్యం మత్తులో రోడ్డు మీద యువకుల వీరంగం

Bhimavaram

భీమవరంలోని (Bhimavaram) బొమ్మ కూడలి వద్ద కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మత్తులో ఉన్న యువకులు కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని దుర్భాషలాడారు. అతను బస్సు దిగి వచ్చి ప్రశ్నించగా.. అందరూ కలిసి దాడి చేశారు. అతడు వెళ్తున్న బస్సు వెంబడించి యువకులు వెకిలి చేష్టలు, డ్యాన్సులు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. దీనిపై ఎస్పీ అద్నాన్ నయూం అస్మి మాట్లాడుతూ.. యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు: నాయని రాజేందర్ రెడ్డి

Konda Murali High command

హైదరాబాద్: సీనియర్ నేతగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. కొండా మురళి వ్యాఖ్యలపై హైకమాండ్ (High command Murali comments) కు ఫిర్యాదు చేస్తాం అని అన్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఈ విషయంపై అధిష్టానం ఆలోచన చేయాలని చెప్పారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అని హెచ్చరించారు. లోకల్ బాడీ ఎన్నికల సమయంలో ఇలా మాట్లాడటం సరికాదని విమర్శించారు. మీ పాపాలు కులాన్ని అడ్డుపెట్టుకుంటే పోతాయా? అని నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు.