దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. ఈ కంపెనీకి సంబంధిచిన కొన్ని కార్లు మే నెలలో అమ్మకాలు వేగం పుంజుకోగా, మరికొన్ని కొన్ని కార్ల అమ్మకాలు తగ్గాయి. మారుతి ఫ్యామిలీ సెడాన్ కారు డిజైర్ అమ్మకాలు బాగా జరిగాయి. దీనితో పాటు బ్రెజ్జా, ఎర్టిగా కార్ల విక్రయాలు కూడా ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ మూడు కార్లు వేర్వేరు విభాగాల నుండి వచ్చాయి. గత నెలలో అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి ఈ 3 కార్ల గురించి చూద్దాం.
మారుతి కార్ల విక్రయాల్లో డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా అమ్మకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. గత సంవత్సరం మే నెలలో కంపెనీ బ్రెజ్జా 16,061 యూనిట్లను విక్రయించగా.. ఈ ఏడాది గత నెలలో (మే) 18,084 యూనిట్ల విక్రయించింది. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కంపెనీ ఈ కారు 2023 యూనిట్లును విక్రయించింది. దీనితో పాటు ఎర్టిగా గురించి మాట్లాడుకుంటే..గత నెలలో ఈ కారు 16,140 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే గత సంవత్సరం ఇదే సమయంలో ఈ సంఖ్య 13,892 యూనిట్లు. ఇకపోతే, డిజైర్ 18,084 యూనిట్లతో అమ్మకాలలో ముందుంది. గత సంవత్సరం ఇదే సమయంలో దాని 16,061 యూనిట్లు అమ్ముడయ్యాయి.