34 మెడికల్ కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలి: రేవంత్ రెడ్డి

Construction facilities colleges

హైదరాబాద్: అన్ని కాలేజీల్లో మూడేళ్లలోగా వసతుల నిర్మాణం పూర్తవ్వాలని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీ, సిబ్బంది ప్రమోషన్లపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 34 మెడికల్ కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలంటూ ప్రతి కాలేజీని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ (Action plan) ను వెంట‌నే త‌యారు చేయాల‌ని అధికారులకు ఆదేశించారు. అవసరాలు, నిధుల వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. అనుబంధ ఆస్పత్రుల్లో పరికరాలు, పడకలు పెంచాలని అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులకు తాను చొరవ తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

జైలుకు పోవాలని కెటిఆర్‌కు కుతూహలంగా ఉంది: సీతక్క

KTR Seethakka

హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) సోమవారం ఎసిబి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాను విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రి సీతక్క(Seethakka) కెటిఆర్‌పై విమర్శులు గుప్పించారు. కెటిఆర్‌కు జైలు పోవాలని కుతూహలంగా ఉందని సెటైర్లు వేశారు. కెటిఆర్ అందుకే సిఎంను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. కెటిఆర్‌, కవితకు మధ్య పోటీ నెలకొందని అన్నారు. కవిత జైలుకు పోయివచ్చి బిపి ఎజెండా ఎత్తుకుందని.. ఇప్పుడు కెటిఆర్ కూడా జైలుకు వెళ్లి కొత్త వ్యూహాలు రచించే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఏదో ఆశించే కెటిఆర్ జైలుకు వెళ్తా అని అంటున్నారని విమర్శించారు.

ఎపి ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సంక్షేమం ఆపలేదు: నిమ్మల

Annadaata sukhibhava performed

అమరావతి: ఒకే నెలలో రెండు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ (Annadata sukhibhava) అమలు చేస్తామని అన్నారు. ఎపి ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సంక్షేమం ఆపలేదని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం అమలవుతుందని చెప్పారు. వైసిపి ఐదేళ్ల హయంలో 90 శాతం హామీలు నెరవేర్చలేదని, ‘తల్లికి వందనం’ పై వైసిపి నేతలకు మాట్లాడే అర్హత లేదని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

పాల‌కూర మంచిదే.. కానీ అధికంగా తింటే..?

మన ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి ఆహారాలపై అనేక ఖర్చులు చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటాము. కూరగాయలలో భాగంగా పాలకూరను ఆహారంలో చేర్చుకుంటాము.

పాలకూర ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైంది. దీనికి కారణం ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడతాయి. అందుకే పాలకూరను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. అయితే అధికంగా పాలకూరని తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో హానికరం కావచ్చు. అధికంగా పాలకుర తీసుకుంటే వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాలకూరను అధికంగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాలకూరలో ఆక్సలేట్ స్థాయి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియంతో కలిసి రాలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది.

పాలకూరను అధికంగా తీసుకుంటే ఇందులో ఉండే ఆక్సలేట్, ఐరన్, కాల్షియం, జింక్ వంటివి శోషణ కు అడ్డుపడుతాయి. దీంతో శరీరంలో అవసరమైన పోషకాల కొరత కూడా ఏర్పడవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపించవచ్చు.

పాలకూరలో ఉండే కొన్ని పదార్థాల వల్ల అలర్జీలు రావచ్చు. దీనివల్ల చర్మంపై దురద, దద్దుర్లు, రాషెస్ రావచ్చు. ఒకవేళ పాలకూర తిన్న తర్వాత చర్మంపై ఏదైనా ప్రతిస్పందన కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నవారు పాలకూర తినకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే గాయిట్రోజన్ థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు పాలకూరను తక్కువగా తీసుకోవాలి.

అక్కరకు రాని పదవులే బిసిలకు ఇస్తున్నారు : శ్రీనివాస్ గౌడ్

elections conducted reservation

హైదరాబాద్: రిజర్వేషన్ల పై బిసిలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బిసిలకు చేస్తున్న అన్యాయమని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్ (BC Reservation) బిల్ పై ప్రధాని నరేంద్ర మోడీతో ఎందుకు మాట్లాడలేదని, బిసిలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అక్కరకు రాని పదవులే బిసిలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

మే 2025లో మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లు..

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. ఈ కంపెనీకి సంబంధిచిన కొన్ని కార్లు మే నెలలో అమ్మకాలు వేగం పుంజుకోగా, మరికొన్ని కొన్ని కార్ల అమ్మకాలు తగ్గాయి. మారుతి ఫ్యామిలీ సెడాన్ కారు డిజైర్ అమ్మకాలు బాగా జరిగాయి. దీనితో పాటు బ్రెజ్జా, ఎర్టిగా కార్ల విక్రయాలు కూడా ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ మూడు కార్లు వేర్వేరు విభాగాల నుండి వచ్చాయి. గత నెలలో అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి ఈ 3 కార్ల గురించి చూద్దాం.

మారుతి కార్ల విక్రయాల్లో డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా అమ్మకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. గత సంవత్సరం మే నెలలో కంపెనీ బ్రెజ్జా 16,061 యూనిట్లను విక్రయించగా.. ఈ ఏడాది గత నెలలో (మే) 18,084 యూనిట్ల విక్రయించింది. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కంపెనీ ఈ కారు 2023 యూనిట్లును విక్రయించింది. దీనితో పాటు ఎర్టిగా గురించి మాట్లాడుకుంటే..గత నెలలో ఈ కారు 16,140 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే గత సంవత్సరం ఇదే సమయంలో ఈ సంఖ్య 13,892 యూనిట్లు. ఇకపోతే, డిజైర్ 18,084 యూనిట్లతో అమ్మకాలలో ముందుంది. గత సంవత్సరం ఇదే సమయంలో దాని 16,061 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్.. వీటిపై సూపర్ డిస్కౌంట్స్..

ప్రసిద్ధ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఒకదానితో ఒకటి పోటీ పడటానికి ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈ సమయంలో అనేక ఉత్పత్తులపై ధర తగ్గింపుతో పాటు ఇతర ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ ఎపిక్ సేల్ జూన్ 12, 2025 నుండి ప్రారంభమైంది. ఈ సేల్‌ను జూన్ 18, 2025 వరకు సద్వినియోగం చేసుకోవచ్చు. జూన్ ఎపిక్ సేల్ ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో గృహోపకరణాలను చౌకగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా.. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ మొదలైన వాటిని చౌకగా కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ ఎపిక్ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు ఉన్నాయి. ఈ సేల్ కింద ఇన్ఫినిక్స్ ఫోన్‌లను చౌకగా కొనుగోలు చేయవచ్చు. నథింగ్స్ CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా 16-17 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. వివిధ బ్రాండ్‌ల ఫోన్‌లు అప్పుడప్పుడు డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. కాగా, రియల్ మీ P35 5Gపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లను 44 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. హెచ్‌పి, లెనోవో, ఏసర్, ఆసుస్, డెల్ కంపెనీల ల్యాప్‌టాప్‌లపై 44 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. .ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ను 5 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వివిధ మోడళ్ల ల్యాప్‌టాప్‌లు వివిధ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.

నాయిస్ స్మార్ట్‌వాచ్ భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది. వివిధ ఫీచర్లు, ప్రత్యేకతలతో వచ్చే స్మార్ట్‌వాచ్‌లను 68 శాతం నుండి 80 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. శామ్‌సంగ్ స్మార్ట్ వేరబుల్స్‌పై 60 నుండి 65 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది.

ఎక్కువ తగ్గింపుతో వాషింగ్ మెషిన్ లేదా ఫ్రిజ్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్‌లో 29 శాతం వరకు తగ్గింపుతో ఫ్రిజ్‌ను కొనుగోలు చేయవచ్చు. వాషింగ్ మెషిన్‌పై 40 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.

27 ఏళ్ల తర్వాత నెరవేరిన కల.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ గా సౌతాఫ్రికా

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 కప్ ను ఈసారి సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ ను తృటిలో చేజార్చుకున్న సఫారి జట్టు.. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. తొలిసారి డబ్ల్యూటిసి విజేతగా సౌతాఫ్రికా జట్టు నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ సమరంలో ఆస్ట్రేలియా విధించిన 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారి జట్టు 83.4 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. అద్భుత సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మార్ క్రమ్(136), కెప్టెన్ బావుమా(66)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత సౌతాఫ్రికా జట్టు తొలి ఐసిసి ట్రోఫీని గెలిచింది. ఈ క్రమంలో మర్ క్రమ్ కూడా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసిసి ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.

కాగా, ఈ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 207 పరుగులకే పరిమితమైంది. ఇక, తన తొలి ఇన్నింగ్స్ లో 138 రన్స్ కే కుప్పకూలిన సౌతాఫ్రికాకు ఆసీస్ 282 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హజల్ హుడ్ లు చెలరేగుతున్న క్రమంలో అందరూ సఫారి జట్టు గెలవడం కష్టమే అనుకున్నారు. అయితే, ఓపెనర్ మర్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ తో అందరీ అంచనాలను తలకిందులు చేశాడు. కెప్టెన్ బావుమాతో కలిసి మూడో వికెట్ కు అత్యధికంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో సఫారి జట్టు విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో భారీ షాట్ కు ప్రయత్నించిన మర్ క్రమ్ ఔట్ అయ్యాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మరో బ్యాట్స్ మెన్ డేవిడ్ బెడింగ్‌హామ్(21) మిగతా పని పూర్తి చేశాడు. దీంతో 27 ఏళ్లుగా ఊరిస్తున్న ఐసిసి ట్రోఫీని సఫారీ జట్టు సొంతం చేసుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌తో.. అనిరుధ్ వివాహం..?

Kavya Maran Anirudh Ravichander

సినీ పరిశ్రమలో సెలబ్రిటీలపై రూమర్స్ రావడం సహజమే. సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటి రూమర్స్ రావడం ఇంకా పెరిగిపోయింది. అందులో కొన్ని నమ్మేలా ఉంటే.. కొన్ని అస్సులు నమ్మశక్యంగా ఉండవు. తాజాగా అలాంటి రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కి (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో (Kavya Maran)  వివాహం జరుగుతోందని.

తెలుగు, తమిళ భాషల్లో భాషల్లో స్టార్ హీరోలకు మ్యూజిక్ చేస్తూ బిజీగా ఉన్నాడు అనిరుధ్(Anirudh Ravichander). అయితే అతనిపై రూమర్స్ రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో అతను హీరోయిన్లు ఆండ్రియా, కీర్తి సురేశ్‌లతో డేటింగ్‌లో ఉన్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా అతను కావ్య మారన్‌తో(Kavya Maran) ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇద్దరు తమిళవాళ్లే కావడంతో ఇది నిజమేమో అని అంతా అనుకుంటున్నారు. ఇప్పటివరకూ ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు.. అలా అని అంగీకరం లేదు. కాబట్టి ఇప్పటివరకూ ఇది రూమర్ మాత్రమే

విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. AI-171 నంబర్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. విమాన ప్రమాద మృతులకు గౌరవార్ధంగా ఈ నెంబర్ ను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శనివారం ప్రకటించింది. AI-171 స్థానంలో AI-159 నెంబర్‌ విమానం అహ్మదాబాద్-లండన్‌ మధ్య సేవలందించనుందని తెలిపింది.

కాగా, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 270కి పెరిగిందని వైద్యులు తెలిపారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం AI 171 గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే BJ మెడికల్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే.