రాష్ట్రంలో చిల్లర పంచాయితీలు పెడుతున్నది కెసిఆర్, హరీష్ రావు: ఆది శ్రీనివాస్

Banakacharla divert farmers

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు నీటి విషయంలో సమస్య పరిష్కారం అవుతుందనే భయంతో ఉన్నారని,  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎన్ వొసి ఇచ్చాక నీరు వాడుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి చెబితే, హరీష్ రావు తప్పుపడుతున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం అయితే మాట్లాడడానికి మరో అంశం ఉండదనే అభద్రత భావంతో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో చిల్లర పంచాయితీలు పెడుతున్నది మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అని మండిపడ్డారు. గతంలో తెలంగాణకు ద్రోహం (Betrayal Telangana) చేసింది కెసిఆర్, హరీష్ రావు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కెసిఆర్, హరీష్ రావు చర్యల వల్ల తెలంగాణ నష్టపోతుందని, బిఆర్ఎస్ పాలన నుంచే తెలంగాణకు నష్టం జరుగుతోందని చెప్పారు. రైతులను డైవర్ట్ చేయడానికి బనకచర్ల అంశాన్ని ముందుకు తెచ్చారని  ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *