తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం మాకు లేదు: నిమ్మల

tenders many projects

అమరావతి: మమ్మల్ని విమర్శించే తెలంగాణ నేతలు వారు చేసిన పనులు గుర్తుచేసుకోవాలని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతుల్లేకుండానే తెలంగాణ అనేక ప్రాజెక్టులకు టెండర్లు పిలిచిందని, కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులను అనుమతి లేకుండానే చేపట్టారని అన్నారు.  పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతి లేకుండానే చేపట్టలేదా? అని ప్రశ్నించారు. ప్రాథమిక దశ లోనే ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసమేనా? అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *