Sirimalli

My WordPress Blog

US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!

Tensions Between Britain And America

‘‘సుబ్బి పెళ్లి.. వెంకి చావు’’కు వచ్చినట్లుంది మిత్రదేశాల మధ్య సంబంధం. ఇరాన్‌పై దాడికి అగ్ర రాజ్యం కసరత్తు చేస్తుండగా మిత్రదేశాలైన అమెరికా-బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అసలేం ఏం జరిగింది? మధ్యప్రాచ్యం తగాదా ఇప్పుడు బ్రిటన్ వైపు ఎందుకు మళ్లింది. అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఇరాన్-అమెరికా మధ్య గత కొద్దిరోజులుగా ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ నిరాకరించింది. దీంతో ఇరాన్‌పై దాడులు చేసేందుకు అగ్ర రాజ్యం కసరత్తు ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన యుద్ధ నౌకలను అరేబియా సముద్రానికి తరలించింది. ఏ క్షణంలోనైనా దాడులు చేయొచ్చని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది.

ఇంతలోనే ఈ వ్యవహారంలో మిత్ర దేశాలైన బ్రిటన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తలెత్తేలా చేసింది. ఇరాన్‌పై దాడి చేసే క్రమంలో గ్లౌసెస్టర్‌షైర్ సమీపంలో బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ బేస్, హిందూ మహాసముద్రంలో ఉన్న డియెగో గార్సియాను ఉపయోగించుకునేందుకు అమెరికా ప్రత్యేక అనుమతి కోరింది. అందుకు యూకేలోని కీర్ స్టార్మర్ ప్రభుత్వం నిరాకరించింది. అటువంటి దాడిలో పాల్గొని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించబోమని తేల్చి చెప్పింది. అయితే ఈ సైనిక స్థావరాలు ప్రస్తుతం బ్రిటన్-యూఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే ఇరాన్‌పై దాడి చేసే క్రమంలో ఒకవేళ ఉమ్మడి ఎయిర్‌బేస్ అవసరం వస్తుందేమోనన్న ముందస్తు ఆలోచనతో బ్రిటన్ పర్మిషన్ కోరింది. కానీ అందుకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని పేర్కొంది. అటువంటి దాడుల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారమే మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తేలా చేసింది.

బ్రిటన్‌పై ట్రంప్ ఆగ్రహం
బ్రిటన్ వైఖరిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది తప్పుదారి పట్టించే నిర్ణయంగా పేర్కొన్నారు. బ్రిటన్ వైఖరి కారణంగా ఇప్పుడు చాగోస్ దీవుల భవిష్యత్‌పై కూడా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మిత్ర దేశాల మధ్య తీవ్ర వార్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

చాగోస్ దీవుల సంగతేంటి?
బ్రిటన్-అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడు చాగోస్ దీవులపై నీలినీడలు కమ్ముకునేటట్టు కనిపిస్తోంది. డియెగో గార్సియాలో యూఎస్-యూకేకు ఉమ్మడి సైనిక స్థావరం ఉంది. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక కీలకమైన వ్యూహాత్మక స్థావరం. ఇక్కడే చాగోస్ దీవులు ఉన్నాయి. ఇది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం. అయితే ఈ చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించి.. డియెగో గార్సియాను 99 సంవత్సరాల పాటు 35 బిలియన్లకు లీజుకు ఇవ్వాలని యూకే యోచిస్తోంది. అయితే ఈ దీవులపై బ్రిటన్-అమెరికా మధ్య దీర్ఘకాల భాగస్వామ్యం ఉంది. మధ్యప్రాచ్యం, ఇండో-పసిఫిక్‌లో సైనిక కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు రెండు దేశాలకు సంబంధాలు ఉన్నాయి. కానీ ఏకపక్షంగా ఆ దీవులను మారిషిస్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రణాళిక రచిస్తోంది. ఈ నేపథ్యంలో మారిషస్‌తో బ్రిటన్ ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద తప్పుగా అభివర్ణించారు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే.. ఇరాన్‌తో కంటే బ్రిటన్‌తోనే ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: US-Iran: ఇరాన్‌ అష్టదిగ్బంధం.. భారీ దాడులకు అమెరికా ప్లాన్.. ఇజ్రాయెల్ అలర్ట్