ఎపి ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సంక్షేమం ఆపలేదు: నిమ్మల

Annadaata sukhibhava performed

అమరావతి: ఒకే నెలలో రెండు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ (Annadata sukhibhava) అమలు చేస్తామని అన్నారు. ఎపి ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సంక్షేమం ఆపలేదని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం అమలవుతుందని చెప్పారు. వైసిపి ఐదేళ్ల హయంలో 90 శాతం హామీలు నెరవేర్చలేదని, ‘తల్లికి వందనం’ పై వైసిపి నేతలకు మాట్లాడే అర్హత లేదని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *