హైదరాబాద్: రిజర్వేషన్ల పై బిసిలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బిసిలకు చేస్తున్న అన్యాయమని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్ (BC Reservation) బిల్ పై ప్రధాని నరేంద్ర మోడీతో ఎందుకు మాట్లాడలేదని, బిసిలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అక్కరకు రాని పదవులే బిసిలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
అక్కరకు రాని పదవులే బిసిలకు ఇస్తున్నారు : శ్రీనివాస్ గౌడ్

Leave a Reply