నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ఏఐ పాలసీపై సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్లో ఏఐ అభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రోత్సాహం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులపై మాట్లాడనున్నారు. మరోవైపు పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం ప్లీనరీ సెషన్లో, మధ్యాహ్నం WEF నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
The post ఏఐ సమ్మిట్కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. appeared first on Navatelangana.





